AP Gov Andariki Illu Scheme 2025 Money: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పేదల కోసం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తోంది. గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు స్థలం ఇస్తారు. అర్హులైన లబ్ధిదారులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం కూడా అందుతుంది. సొంత ఇల్లు లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.