AP Cabinet On TIDCO Houses: ఆంధ్రప్రదేశ్లో పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది. జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2029 నాటికి అందరికీ ఇళ్లు లేదా స్థలాలు ఇవ్వడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సోలార్ ప్రాజెక్టులకు భూమి లీజుకు ఇవ్వడంతో పాటు, రామాయపట్నం పోర్టు వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు, మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.