AP Govt Housing Sites Can Be Sold After 2 Years: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కేబినెట్ సమావేశమైంది. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలను రెండేళ్ల తర్వాత అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆమోదం తెలిపారు. జోన్ల వ్యవస్థలో మార్పులకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పలు కంపెనీలకు భూముల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.