AP Govt Another 80 Raithu Bazaars: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. కొత్తగా 80 రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. దీని ద్వారా రైతులకు మంచి ధర లభించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు అందుతాయి. అంతేకాకుండా, కూరగాయలతో పాటు వాణిజ్య పంటలు కూడా అమ్మడానికి ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల సౌకర్యార్థం కోల్డ్ స్టోరేజ్ గదులను కూడా నిర్మించనున్నారు.