AP Samagra Shiksha Abhiyan Employees Salaries Released Early: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే పెండింగ్ బకాయిలు రూ.6,200 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగులకు మరో తీపికబురు చెప్పింది. ఉద్యోగులకు 10 రోజులు ముందుగానే జీతాలు చెల్లిస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుక్రవారం నుంచి జీతాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. దాదాపు 25 వేల మంది ఉద్యోగులు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నారు.