Andhra Pradesh Teachers Holiday On February 27th: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ నెల 27న పోలింగ్ రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్లాన్ చేయానలి సూచించారు.