Andhra Pradesh Private Schools Physical Education Must: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై వ్యాయామ విద్యను తప్పనిసరి చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు యోగా, ఆరోగ్య విద్య, క్రీడలు నేర్పాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఇది ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. వారానికి ఆరు పీరియడ్లు వ్యాయామానికి, రోజుకు ఒక గంట శారీరక శ్రమకు కేటాయించాలి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.