ఏపీలో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. వైరస్ వెలుగుచూసిన ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధి మేరకు అలర్ట్ జోన్గా ప్రకటించారు. అలాగే చుట్టూ పదికిలోమీటర్ల పరిధిని సర్వెలెన్స్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతం నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా ఏపీ పశుసంవర్ధక శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.