Narasaraopeta Bird Flu Death: ఏపీలో బర్డ్ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ఫ్లూ (ఎవియన్ ఇన్ఫ్లూయెంజా/హెచ్5ఎన్1) మరణం నమోదైంది. స్థానిక బాలయ్య నగర్కు చెందినరెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. గత నెలలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం మంగళగిరిలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఆ చిన్నారి అక్కడ చికిత్స పొందుతూ మార్చి 16న ప్రాణాలు విడిచింది.