ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల కోసం రీనోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 301 బార్లకు ఓపెన్ కేటగిరీలో లైసెన్సులు కేటాయించనున్నారు. బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కారణంగా గతంలో షెడ్యూల్ ఇచ్చినప్పుడు బార్ల కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదు. దీంతో 299 బార్ల లైసెన్సులు అలాగే ఉండిపోయాయి. ఇటీవల ప్రభుత్వం బార్లపై ఏఆర్ఈటీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో 299 బార్లతోపాటుగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని రెండు బార్లను కలిపి 301 బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చింది. లక్కీ డిప్ పద్ధతిలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. ఫిబ్రవరి నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి ఐదో తేదీ డ్రా తీస్తారు.