Revenue Clinics in AP: రైతుల భూసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జిల్లాలో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసే ఈ క్లినిక్లు, సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా ప్రజల అర్జీలను స్వీకరించి, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరిస్తాయి. పట్టాదారు పాస్పుస్తకం, రీసర్వే వంటి 14 రకాల సమస్యలకు ప్రత్యేక టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఒక్క రోజు.. లేద నిర్దిష్ట వ్యవధిలో సమస్యలను పరిష్కరిస్తారు.