Vijayawada West Bypass Road Vehicles Allow: విజయవాడలో దసరా ఉత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గగుడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పశ్చిమ బైపాస్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.