ఏపీలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానుంది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంకల్పించింది. బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తునట్లు ప్రకటించింది. తాజాగా అమరావతి రైల్వే లైన్ మొదటి దశ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎర్రుపాలెం నంబూరు మార్గంలో 57 కిలోమీటర్ల మేర అమరావతి రైల్వే లైన్ నిర్మించనున్నారు.