Machilipatnam Repalle Railway Line: మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఎంపీ బాలశౌరి చొరవతో దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా మచిలీపట్నం నుండి తిరుపతికి రోజూ రైలు ఏర్పాటు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు.