Guntur To Guntakal Railway Line Doubling: ఏపీలో మరో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు వేగవంతం చేశారు.. ఈ పనులు ముగింపు దశకు చేరుకున్నారు. ఏపీ రాజధానికి కనెక్టివిటీ పెంచే గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గం పనులు దాదాపుగా తుది దశకు వచ్చాయి. ఈ రైలు మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయితే రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య రాకపోకలు వేగవంతం అవుతాయి. సొరంగం పనులు 2026 డిసెంబరుకు పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.