ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీప్లేన్ సర్వీసుల ద్వారా సందర్శకులను ఆకర్షించాలని పర్యాటకశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ శ్రీశైలం సీప్లేన్ సర్వీసును కూడా లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు మరోచోట సీప్లేన్ సర్వీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలెట్టారు. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏపీ పర్యాటక శాఖ, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్, ఏపీ జెన్కో అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. రుషికొండ- జోలాపుట్ సీప్లేన్ సర్వీసుపై అధ్యయనం జరిపారు.