టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేశారు. ఫిట్మెంట్, ప్రభుత్వంలో విలీనం, పెండింగ్ బకాయిలు, ఆంక్షలు ఎత్తివేయాలంటూ పలు డిమాండ్లు చేస్తూ.. యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. ఆర్టీసీ కార్మిక సంఘాలు.. దీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.