IAS Transfers in Andhra Pradesh: ఏపీలో మరోసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రి రెడ్డి, పెట్టుబడులు శాఖ ఎండీగా శౌర్యమాన్ పటేల్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.