Andhra Pradesh Government AMC Posts: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ఖరారు చేసింది. టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయించగా, ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు ప్రోత్సాహకంగా రూ.260 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.