Upasana Motherhood Project: టాలీవుడ్ హీరో రామ్చరణ్ సతీమని ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తాత అపోలో ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 93వ జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో సంస్థల వైస్ ఛైర్మన్, రామ్చరణ్ సతీమణి ఉపాసన ఫౌండేషన్ తరఫున ఏపీలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచే ప్రారంభిస్తామంటున్నారు.