Nadendla Manohar On Ujjwala Scheme 65 Lakhs: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో పర్యటనకు వెళ్లారు. ఉజ్వల పథకంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో చర్చించారు.. ఉజ్వల పథకానికి సంబంధించి లబ్ధిదారులను 65.40 లక్షలకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఫలితంగా దీపం-2 పథకంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.587 కోట్లు సబ్సిడీ రూపంలో వస్తాయి అన్నారు.