ఆంధ్రప్రదేశ్లో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఇస్తున్న మెటర్నిటీ లీవులను మరికొన్ని రోజులు పెంచుతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మెటర్నిటీ లీవులు ఇస్తుండగా.. ఇక నుంచి ఎంత మంది పిల్లలను కంటే.. అన్ని సార్లు మెటర్నిటీ లీవులు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది.