AP Govt Three Chairpersons Cabinet Rank: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ముగ్గురు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి కేబినెట్ హోదా కల్పించింది. మహిళా కమిషన్ ఛైర్పర్సన్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్లకు ఈ హోదా లభించింది. అంతేకాకుండా, వివిధ కార్పొరేషన్లు, బోర్డుల ఛైర్మన్ల జీతాలను నిర్ణయించడంతో పాటు PMAY 2.0 పథకానికి రూ.405 కోట్లు విడుదల చేసింది. విద్యా రికార్డుల అప్లోడ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు.