ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టే రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు. అలాగే హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్, చెన్నై బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రణాళికలపై చంద్రబాబు సమీక్షించారు.