ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఏపీలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. అందుకు కర్నూలు జిల్లా అనువుగా ఉంటుందనే ఆలోచనలో రిలయన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ డీపీఆర్ సమర్పించింది. రూ.1622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం డీపీఆర్ సమర్పించింది. ఇందుకోసం వంద ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.