BPCL Indias Costliest Refinery In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ ప్రకటించారు. ఆరు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.96,862 కోట్లు అని తెలిపారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.