Ap Govt Allocated Officers For New Districts: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పాలన నేటి నుంచి ప్రారంభం అవుతోంది. పోలవరం, మార్కాపురం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను నియమించారు. పోలవరం జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉండగా, మార్కాపురం జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలు ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే మరికొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు.