జూన్ ఒకటో తేదీ నుంచి ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. అయితే ఈ విధానాన్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ విధానం ప్రారంభించారు. మరోవైపు రేషన్ పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేషన్ షాపుల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది.