ఏపీలో రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం ఒక కీలక సూచన చేసింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. అందులో ఏవైనా తప్పులు దొర్లితే.. వాటిని సరి చేసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఈ వచ్చే నెలాఖరు వరకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.