Andhra Pradesh Ration Shops Wheat Flour Rs 20 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించాలని నిర్ణయించింది. మార్కెట్ ధర కంటే తక్కువగా కిలో రూ.20కే నాణ్యమైన చక్కీ గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనుంది. ఈ పథకం ద్వారా పేద ప్రజలు కూడా పండగ సమయంలో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.