Andhra Pradesh Aqua Farmers Protest: ఏపీలో ఆక్వా రైతులపై ట్రంప్ టారిఫ్ ప్రభావం కనిపిస్తోంది. ఈ మేరకు రొయ్యల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు రొయ్యల ధరల అన్యాయంపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో మూడు నెలలు ఆక్వా సాగుకు విరామం ప్రకటించారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభలో నిర్ణయించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. జాతీయ రహదారిపై ధర్నా చేశారు.