ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 80శాతం రాయితీ, మంత్రి కీలక ప్రకటన

2 years ago 61
Ap Govt 80 Percent Subsidy Paddy Seeds: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష చేశారు.. వారికి పలు కీలక సూచనలు చేశారు. అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 6,356 క్వింటాళ్లు వరి విత్తనాలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. రైతుల అవసరాలకు తగినట్లుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు మంత్రి.
Read Entire Article