AP Revenue Aadhaar User Agency: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భూముల వ్యవహారాల్లో ఆధార్ సేవలను అందించే యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖను ఎంపిక చేసింది. దీని ద్వారా రైతుల భూములను ఆధార్తో అనుసంధానం చేయడం సులభమవుతుంది, అంతేకాకుండా పంటల బీమా మరియు పెట్టుబడి పథకాలు సకాలంలో అందుతాయి. రైతుల సమస్యలకు ఇక చెక్ పడినట్లే.. ప్రైవేట్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.