ఏపీలో రైతులకు భారీ ఊరట.. రూ.550 కోట్లతో ఆ పంటలకు గిట్టుబాటు ధర, చంద్రబాబు ఆదేశాలు

1 year ago 34
మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.550 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. నల్లబర్లీ పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడికి కిలోకు రూ.12, కోకోకు రూ.50 అదనంగా చెల్లించనున్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కొనుగోళ్లు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
Read Entire Article