Yesvantpur Vande Bharat Express Halt December 27: రైలు ప్రయాణికులకు శుభవార్త! యశ్వంత్పూర్-కాచిగూడ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇక హిందూపురం స్టేషన్లో ఆగనుంది. ఈ నెల 27 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రైళ్ల వల్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుందని చెబుతున్నారు.