Two Express Trains Stoppage In Kovvur: కొవ్వూరు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం-కడప తిరుమల, విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్తగా హాల్ట్ మంజూరు చేశారు. ఎంపీ పురందేశ్వరి ఈ రైళ్లను ప్రారంభించి, భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.30 కోట్లతో అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయనున్నారని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు.