APSRTC To Pay Rs 9 Crore To Women: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి 9కోట్లు పరిహారాన్ని ఎపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం తీర్పునిచ్చింది. 2009లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.