ఏపీలోని వరి రైతులకు ముఖ్య గమనిక. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధరను నిర్ణయించింది. సాధారణం, ఏగ్రేడ్ రకాలుగా విభజించి ధరలు నిర్ణయించింది. అలాగే రైతులు ప్రభుత్వానికి తమ పంటను అమ్ముకునేందుకు వీలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల వద్దకు రైతులు తమ ధాన్యాన్ని తరలించి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ధాన్యం తరలింపు కోసం ఉపయోగించే రవాణా ఖర్చులను తొలుత రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది.