ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఉచిత త్రిచక్ర వాహనాల పంపిణీకి సిద్ధమైంది. ఒక్కో నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మందికి ఈ వాహనాలు అందజేయనున్నారు. 125 సీసీ సామర్థ్యం గల 'హీరో' వాహనాలను ఆర్ఎం మోటార్స్ సరఫరా చేయనుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. 70 శాతం వైకల్యం ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసు గలవారు, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు.