AP Govt Deliver Ration 5 Days Early: ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూలైలో ఇవ్వాల్సిన రేషన్ను జూన్ 26 నుంచే పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లతో సమావేశంలో పలు సూచనలు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26 నుంచి 30 తేదీలలోపు ఇంటి దగ్గరే రేషన్ అందించాలని నిర్ణయించారు. జూన్ నుంచి డీలర్ల ద్వారా పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు.