AP Govt Free Modern Sewing Machines Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైలర్లకు ఆధునిక కుట్టు మిషన్లు అందించే 'ఆదరణ 3.0' పథకాన్ని రూ.1,000 కోట్లతో త్వరలో అమలు చేయనుంది. అలాగే, నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ అందిస్తూ, వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకాలతో లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు. అయితే, మంత్రి సవిత లడ్డూ ప్రసాదం కల్తీపై జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.