AP Free Power Scheme Handloom Weavers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలకు శుభవార్త తెలిపింది. ఆగస్టు 7 నుంచి చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. కొత్త ఆరోగ్య పథకం ద్వారా చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. పాత పాలనలోని అవినీతిని ఎన్డీఏ ప్రభుత్వం బయటకు తీస్తుంటే వారు భయపడుతున్నారని అన్నారు.