Andhra Pradesh Pastors Salary Rs 5000 Released: ఏపీ ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాస్టర్లకు సంబంధించి గౌరవవేతనాల కోసం నిధుల్ని విడుదల చేసింది. 2024-25 ఏడాదికి నిధులు రూ.12.82 కోట్లు మంజూరు చేశారు. 2024 మే నెల నుంచి గౌరవ వేతనాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ రూ12.82 కోట్లను 6 నెలల గౌరవవేతనం చెల్లింపునకు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.