AP Govt Pension For Spouse Category Rs 4000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబరు నెల పింఛన్లు అందరికీ అందిస్తామని తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 63.61 లక్షల మందికి రూ.2,746.52 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు, పారదర్శకత కోసం జియో కోఆర్డినేట్స్ను నమోదు చేస్తున్నారు. గతంలో అనర్హులుగా తేలిన 1.35 లక్షల మందికి వైద్యారోగ్యశాఖ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.