AP Govt Rs 20000 To Maoists Each: లొంగిపోయిన మావోయిస్టులకు ఆంధ్రప్రదేశ్లో సాయం ప్రకటించారు. మొత్తం 56 మంది మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.11.20 లక్షలు తక్షణ సాయంగా అందించనుంది. మరోవైపు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పీడీ యాక్టును ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. వివిధ శాఖల విద్యుత్ బిల్లుల కోసం రూ.74.70 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం రూ.4.94 కోట్లు కేటాయించింది.