Ntr Bharosa Pension Scheme Spouse Category: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ దారులకు శుభవార్త తెలిపింది. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్డీయే ప్రభుత్వం స్పౌజ్ పింఛను పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. పూర్తి వివరాల కోసం మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.