AP Govt Free Three Wheeler Bikes To Disabled: దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాలు, వినికిడి పరికరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.5 కోట్లతో 875 త్రిచక్ర వాహనాలు, రూ.7 కోట్లతో వినికిడి పరికరాలు అందించనుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో న్యాయ అకాడమీ నిర్మాణానికి రూ.165.33 కోట్లు, పులిచింతల ప్రాజెక్టుకు రూ.2.84 కోట్లు, ఏపీ ఫైబర్నెట్కు రూ.54.61 కోట్లు కేటాయింపులు జరిగాయి.