Andhra Pradesh Disabled Pensions Clarity: అర్హులైన ఏ ఒక్కరి పింఛనూ తొలగించలేదని, కేవలం సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన మాత్రమే జరుగుతోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని, ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. దివ్యాంగుల పింఛన్లను రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని ప్రశంసించారు. పింఛన్ల అంశంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.