ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికీ నెల నెలా రూ.4 వేల పెన్షన్ అందించనుంది. జూన్ 12వ తేదీ నుంచే ఈ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని ఒంటరి మహిళలు, వితంతువులకు.. కొత్తగా పింఛన్లు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత సర్కార్ వెల్లడించింది.