ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంపై ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక అప్డేట్ వెలువరించారు. జూన్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆలోపే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ రూ.15 వేలు జమ చేయనున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు.